రామగిరి, డిసెంబర్ 8 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్(ఐసీటీ) వాలీబాల్ పురుషుల, మహిళల పోటీలు బుధవారం హోరాహోరీగా సాగాయి. పురుషుల విభాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులను భువనగిరి ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల, హూజూర్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలు కైవసం చేసుకున్నాయి. అనంతరం వాలీబాల్ పురుషుల, మహిళల జట్లులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు తిరిగి పోటీలు నిర్వహించి యూనివర్సిటీ జట్లను ఎంపిక చేశారు. వీరంతా జాతీయ స్థాయిలో నిర్వహించే సౌత్జోన్ వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్నారు. వీరికి ఎంజీయూ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ పి.విష్ణుదేవ్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో ఎంజీయూ పీడీలు ఆర్.మురళి, డాక్టర్ వై.శ్రీనివాస్రెడ్డి, ఎన్జీ, ఉమెన్స్ కళాశాలల పీడీలు కడారి మల్లేశ్, పీడీ కల్యాణి పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు ఎంపిక
యూనివర్సిటీకి ఎంపికైన జట్లు ఈ నెలలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై(తమిళనాడు)లో జరిగే జాతీయ స్థాయి సౌత్జోన్ క్రీడాపోటీల్లో పాల్గొంటారు. ఈ నెల 13నుంచి 16వరకు మహిళలకు, ఈ నెల 18నుంచి 23వరకు పురుషులకు అదే యూనివర్సిటీలో జాతీయ స్థాయి పోటీలు ఉంటాయని ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి వెల్లడించారు. ఎవరైనా రాకుంటే వెయిటింగ్లో ఉన్న క్రీడాకారులను తీసుకెళ్తామన్నారు.