నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘కృష్ణ వ్రిందా విహారి’. ఈ చిత్రంలో షెర్లీ సెటియా నాయికగా నటిస్తున్నది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. చిత్ర లిరికల్ గీతాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘ఏముంది రా..’ పాటను రిలీజ్ చేశారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు హర్ష సాహిత్యాన్ని రాయగా…హరిచరణ్ ఆలపించారు. ఈ పాటలో సంప్రదాయ బ్రాహ్మణ యువతిగా షెర్లీ సెటిగా కనిపించింది. ప్రేమ, పెళ్లి, పిల్లలు..ఇలా హీరో హీరోయిన్ల జీవితంలోని సంతోషకర ఘట్టాలను పాటలో చిత్రీకరించారు. రాధిక, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్.