రాజ్తరుణ్, కశిష్ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీనుగవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకాలపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 26న విడుదలకానుంది. ట్రైలర్ను బుధవారం అగ్రహీరో నాగార్జున విడుదలచేశారు. ‘రూపాయి పాపాయిలాంటిదిరా..దానిని పెంచి పెద్దది చేసుకోవాలికానీ ఎవడి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు’ అనే టైటిల్తో వినోదాత్మకంగా ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో రాజు అనే సెక్యూరిటీగార్డ్గా, బంగారం అనే పల్లెటూరి యువకుడిగా రెండు భిన్న కోణాలున్న పాత్రల్లో రాజ్తరుణ్ కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘వినోదభరిత కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. తన ఊరి ఎన్నికలతో పాటు ప్రేమలో ఓ యువకుడు ఎలా విజేతగా నిలిచాడన్నది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, అజయ్, నరేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్.