హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ)/ బోడుప్పల్: బిగ్బాస్ కార్యక్రమంలో ప్రకటించినట్టుగానే ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున తన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో 1,080 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీబ్లాక్ పరిధిలో తన తండ్రి, అలనాటి అగ్రనటుడు అకినేని నాగేశ్వరరావు పేరు మీద ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్ పారుకు గురువారం ఎంపీ సంతోష్కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్తో పాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అటవీపారు అభివృద్ధికిగాను హరితనిధికి రూ.రెండు కోట్ల చెక్కును అటవీశాఖ అధికారులకు అందజేశారు. ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్చాలెంజ్లో తాను పలు సార్లు మొకలు నాటినట్టు నాగార్జున తెలిపారు. గత బిగ్బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అటవీదత్తతపై సంతోష్కుమార్తో చర్చించానని, ఆ రోజు వేదికపై ప్రకటించినట్టు గానే ఇప్పుడు అటవీ పునరుద్ధరణ, అర్బన్ ఫారెస్ట్పారు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉన్నదని నాగార్జున పేర్కొన్నారు.
ప్రశంసించిన ఎంపీ సంతోష్కుమార్
అటవీ భూమి దత్తతకు నాగార్జున ముందకు రావడాన్ని ఎంపీ సంతోష్కుమార్ ప్రశంసించారు. చెంగిచర్ల ఫారెస్ట్ బ్లాక్లో ఏఎన్నార్ అర్బన్పారు అభివృద్ధి పాటు, ఖాళీ ప్రదేశాల్లో దశల వారీగా లక్ష మొకలను నాటే కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించినట్టు వెల్లడించారు. దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక హైదరాబాద్కే ఉన్నదని చెప్పారు. రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీభూమిని పరిరక్షించటం, పునరుద్ధరించడం, అర్బన్ పారుల ఏర్పాటుకు గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.
ఇందుకు సామాజిక బాధ్యతగా ముందుకొచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ స్పెషల్ సెక్రటరీ ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, పీసీసీఎఫ్ (ఎస్ఎఫ్) ఆర్ఏం డోబ్రియల్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్, నాగార్జున ఇతర కుటుంబ సభ్యులు యార్లగడ్డ సుప్రియ, యార్లగడ్డ సురేంద్ర, సుమంత్కుమార్, సుశాంత్, నాగసుశీల, లక్ష్మీసాహిత్య, సరోజ, వెంకట నారాయణరావు, జ్యోత్స్న, అనుపమ, అదిత్య, సంగీత, సాగరిక తదితరులు పాల్గొన్నారు.