నాయ్పైటా : పదవీచ్యుతురాలైన ఆంగ్ సాన్ సూకీ ఆరోగ్యంగా ఉన్నారని మయన్మార్ జుంటా నాయకుడు మిన్ ఆంగ్ హ్లింగ్ స్పష్టం చేశారు. త్వరలోనే ఆమెను విచారణ నిమత్తం కోర్టులో హాజరుపరుస్తారని ఆయన తెలిపారు. సూకీ తన ఇంట్లోనే ఉన్నారని, ఆరోగ్యంగా కూడా ఉన్నారని హాంగ్ కాంగ్ కు చెందిన చైనా భాషా మీడియాతో వీడియో లింక్ ద్వారా మిన్ ఆంగ్ హ్లింగ్ చెప్పారు.
ఫిబ్రవరి 1 తిరుగుబాటుతో ప్రభుత్వాన్ని పడగొట్టిన అనంతరం జుంటా నేత తొలిసారి ఒక మీడియాతో మాట్లాడారు. మునుపటి సైనిక పాలకులపై సుదీర్ఘ పోరాటం చేసినందుకు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సూకీ.. ప్రస్తుత తిరుగుబాటు తర్వాత జుంటా నేత ఆధీనంలో ఉన్నారు. 4,000 మందికి పైగా మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా వాకీ-టాకీ రేడియోలను కలిగి ఉండటం నుంచి మొదలుకొని రాష్ట్ర రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించే వరకు ఆమె వివిధ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
సూకీని తదుపరి విచారణ నిమిత్తం సోమవారం రాజధాని నాయ్పైటాలోని కోర్టులో జరుగనున్నది. ఇప్పటివరకు ఆమె వీడియో లింక్ ద్వారా మాత్రమే కనిపించింది. ఇప్పటిదాకా ఆమెను తన న్యాయవాదులతో నేరుగా మాట్లాడటానికి జుంటా నేతలు అనుమతించలేదు.
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
సువేందు అధికారి తండ్రి, సోదరుడికి వై ప్లస్ భద్రత
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశానికి భారత్కు ఆహ్వానం
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..