ఆత్మకూరు(ఎం), మార్చి 21 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలని జడ్పీ సీఈఓ సీహెచ్.కృష్ణారెడ్డి అన్నారు. దళితబంధు పథకానికి ఎంపికైన మండలంలోని మొరిపిరాల గ్రామ లబ్ధిదారులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా అధికారి శ్రీలక్ష్మి, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి గోపిరెడ్డి, జిల్లా ఎంఏఈఐ అధికారి ఇమ్రాన్, ఏడీఏ పద్మావతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్, ఎంపీపీ తండ మంగమ్మ, ఎంపీడీఓ రాములు, ఎంపీఓ పద్మావతి, ఏఓ శిల్ప, సర్పంచ్ సామ తిరుమల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.