మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. మునుగోడు విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబారాన్నంటాయి. మునుగోడు ఫలితంపై జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… మునుగోడు ప్రజలు కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని, ఏడాది కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారాయన. అంతేకాదు, మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడానికి భాద్యతగా పనిచేస్తానన్నారు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా ప్రజలందరూ ఆమోదిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర వహించిన ప్రజలకు,పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి. బీజేపీ పతనానికి మునుగోడే నాంది అయ్యిందని, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఈ ఫలితంతో రుజువైందని ఆయన స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఅర్ లాంటి నాయకుడు అత్యవసరమని పేర్కొన్నారు జగదీశ్ రెడ్డి.