ముంబై: రిలయన్స్ సంస్థ ఓనర్ ముఖేశ్ అంబానీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ కేసులో ఒకర్ని అరెస్టు చేశారు. చంపేస్తామంటూ ఫోన్స్ చేస్తున్నారని ఇవాళ ముంబై పోలీసులకు రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ఫిర్యాదు నమోదు చేసింది. ముఖేశ్ అంబానీతో పాటు ఆయన ఫ్యామిలీని హతమారుస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిపారు. రిలయన్స్ హాస్పిటల్కు మూడుసార్లు ఆ కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కేసు బుక్ చేశారు. దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని అఫ్జల్గా గుర్తించారు. అతనే బెదిరింపు కాల్స్ చేసినట్లు భావిస్తున్నారు.
Mumbai | The call was received at around 10:30 am at Reliance Foundation Hospital. One person has been detained in this case. We are investigating the matter: Neelotpal DCP, Zone 2 https://t.co/MzBq4sBN99 pic.twitter.com/gbRv6vbtJE
— ANI (@ANI) August 15, 2022
గత ఏడాది కూడా ముకేశ్కు బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇంటి ముందు ఓ స్కార్పియో కారుతో పాటు 20 జెలాటిన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకున్న విషయం తె లిసిందే. ఆంటిలియా ఇంటి ముందు ఓ బెదిరింపు లేఖను కూడా గుర్తించారు.