న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రముఖ మొబైల్ సంస్థ మోటరోలా సరికొత్త మొబైల్ను ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యధిక రిసొల్యుషన్ 60 మెగాపిక్సెల్, 50+50 మెగాపిక్సెల్ కెమెరాలు కలిగిన మోటరోలా ఎడ్జ్ 30 ప్రొ ధరను రూ.49,999గా నిర్ణయించింది. ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేసిన వారికి రూ.5 వేల వరకు క్యాష్బ్యాక్ లభించనున్నది. మార్చి 4 నుంచి ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్తోపాటు అతిపెద్ద రిటైల్ అవుట్లెట్లలో లభించనున్నది.
ప్రాసెసర్: 5జీ-క్వాల్కామ్ స్నాప్డ్రాగన్-8 జనరేషన్
కెమెరా: 50 మెగాపిక్సెల్, ముందుభాగంలో సెన్సార్ కలిగిన 60 మెగాపిక్సెల్ కెమెరా,
బ్యాటరీ: 4800 ఎంఏహెచ్, కేవలం పదిహేను నిమిషాల్లో సగం చార్జీంగ్ అవనున్నది. వైర్లెస్ చార్జింగ్ కూడా..
ర్యామ్: 8 జీబీ ర్యామ్
మెమొరీ: 128 జీబీ
ధర: 49,999
ఈ మొబైల్ను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకంగా రూ.5 వేల వరకు క్యాష్బ్యాక్ లభించనున్నది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్-ఈఎంఐ, ఈఎంఐ లేకుండా కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ వర్తించనున్నది. వీరికి ఈ మొబైల్ రూ.44,999కి లభించనున్నది. అలాగే రిలయన్స్ జియో నుంచి రూ.10 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చును.