న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారానికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి మోటర్ వెహికల్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. దీని వల్ల హైకోర్టుల్లో పెండింగ్ కేసుల భారం తగ్గుతుందని, కేసుల సత్వర పరిష్కారానికి వీలవుతుందని పేర్కొంది. ఈ ట్రిబ్యునళ్లలో ఇద్దరు సీనియర్ డిస్ట్రిక్ట్ జడ్జీలు ఉండాలని సూచించింది. రాష్ట్ర రాజధానులతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ వీటి బెంచ్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరింది.