సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ ) : నాణ్యతతో కూడిన ఆహారం అందిస్తున్నందునే అన్ని వర్గాల ప్రజలు అన్నపూర్ణ కేంద్రాలకు వెళ్లి ఆకలిని తీర్చుకుంటున్నారని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి అన్నారు. పేదవారు ఆకలితో ఆలమటించకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఐదు రూపాయల భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు. సోమవారం టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డిలతో కలిసి డిప్యూటీ మేయర్ నిలోఫర్ దవాఖానను సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిజాం కాలేజీ వద్ద అన్నపూర్ణ కేంద్రంలో భోజనం చేశారు. భోజనం బాగుందని కితాబిచ్చారు. కాగా, సోమవారం 66,610 మందికి భోజనం అందించినట్లు అధికారులు తెలిపారు.