సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జీవనదిగా విరాజిల్లిన మూసీ నదిని వాణిజ్య కాంక్రీట్ నిర్మాణాల నుంచి రక్షించుకోవాలని, నిర్వాసితుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూసీ జన ఆందోళన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్లోని ధర్నా చౌక్లో భారీ నిరసన కార్యక్రమానికి సన్నాహాలు చేశారు.
గురువారం నిర్వహించే ఈ ఆందోళన కార్యక్రమంలో సహజ సిద్ధమైన నదీ వ్యవస్థను, పర్యావరణ పునరుద్ధరణను కాపాడుతూ సరైన నది పరీవాహక ప్రాంత ప్రణాళిక కావాలని, రియల్ ఎస్టేట్ వ్యాపార రీతిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట కాంక్రీట్ జంగిల్గా మార్చవద్దని, సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేయాలని ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.