son of india | సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మిప్రసన్నపిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్, హీరో శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది. ప్రపంచమంతా నా కుటుంబం,ప్రపంచం బాధే నా బాధ..అంటూ మొదలైన ట్రైలర్ ..స్వామీ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యేగే..నేను దాన్నే ఫాలో అవుతున్నాను అంటూ మోహన్బాబు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇండియాలో అస్సలు న్యాయమే జరగదా అని ప్రగ్యా జైస్వాల్ ప్రశ్నలు కురిపిస్తుంది. డబ్బున్నోడికో న్యాయం డబ్బులేనోడికో న్యాయం. పవర్ ఉన్నోడికో న్యాయం..పవర్ లేనోడికో న్యాయం డెమోక్రసిలో లా ఒక్కొక్కడికి ఒకలా ఉంటే ఎలా..అయోధ్యలో శ్రీరామ అని రాసిని ప్రతి ఇటుకమీద ప్రమాణం చేసి చెప్తున్నా..ఈ సొసైటీలో చెత్తనాకొడుకలని క్రిమినల్నా కొడుకులని ఏరీపారెయ్యాలి అంటూ మోహన్బాబు పలికే సంభాషణలు ఆలోచింపచేస్తున్నాయి. పోరాటంలో అతని వెనుక ఇండియానే ఉంది అని తణికెళ్ళభరణి హీరోని ఎలివేట్ చేస్తున్నట్లు ఉంది. ట్రైలర్ చివర్లో ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం నీతో పాటు 138కోట్ల ఇండియాన్స్కు చాలా డీటెయిల్గా చెప్తా అంటూ ముగుస్తుంది. పొలికల్ డ్రామా నెపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనట్లు తెలుస్తుంది.