న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రధానమంత్రి గరీబ్ అన్నయోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని వచ్చేఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద అర్హులైన 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను (బియ్యం లేదా గోధుమలు) ఉచితంగా సరఫరా చేస్తారు. కాగా, నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్కు వచ్చే ఐదేండ్లకు గానూ రూ. 3,054 కోట్లు
దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ యూటీలో విద్యుత్తు సరఫరాను ప్రైవేటీకరణ చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు ఓ-స్మార్ట్ స్కీమ్ కోసం రూ. 2,177 కోట్లు.
వాతావరణ పరిశోధనలకు గానూ అక్రాస్ స్కీమ్కు రూ. 2,135 కోట్లు.