నిజామాబాద్ : తెలంగాణపై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి శవ యాత్ర నిర్వహించారు.
ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వర్గ రథంలో మోదీ శవయాత్రను చేపట్టారు.
పుర వీధుల్లో తిరుగుతూ మోదీకి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు.
కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠల్ రావు బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన జీవన్ రెడ్డి..తనదైన శైలిలో బీజేపీకి వ్యతిరేకంగా నల్ల దుస్తులు ధరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.