హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చేనెల 3 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
ఖమ్మం జిల్లా కల్లూరులో 3.11 సెంటీమీటర్లు, వేంసూర్లో 1.8 సెం.మీ, వైరాలో 1.72 సెం.మీ, తల్లాడలో 1.64 సెం.మీ, సత్తుపల్లిలో 1 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 1.65 సెం.మీ, అన్నపురెడ్డిపల్లిలో 1.31 సెం.మీ, జయశంకర్-భూపాలపల్లి జిల్లా కటరాంలో 1.13 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.