హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): స్త్రీలు సృష్టికర్తలు.. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు.. హిజాబ్ ధరించడం ముసాన్ వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుందని పేర్కొన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాయిష్టాలకే వదిలేయాలని సూచించారు. కర్ణాటకలో హిజాబ్ వివాదంపై స్వదస్తూరితో రాసిన కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.