సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. కారేపల్లి మండలంలోని ఉసిరికాయలపల్లి, అప్పాయిగూడెం, రొట్టమాకురేవు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనాలను మంగళవారం వారు ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలంలో సాగుపై సలహాలు, సూచనలు అందించేందుకు రూ.22 లక్షలతో రైతువేదిక భవనాలను నిర్మించినట్లు చెప్పారు.
కారేపల్లి, ఫిబ్రవరి 21 : తెలంగాణలో వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు దండగన్న వ్యవసాయాన్ని తెలంగాణ ఆవిర్భవించాక పండుగ చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. మండలంలోని ఉసిరికాయలపల్లి, అప్పాయిగూడెం, రొట్టమాకురేవు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనాలను మంగళవారం వారు ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని, ఇందుకోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.
అందుకే ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ సుపరిపాలను కోరుకుంటున్నారన్నారు. మండలాల్లో రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు అందించేందుకు రూ.22 లక్షలతో రైతువేదిక భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పుడు రైతే రాజని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నా యకులు విజయనిర్మల, మాలోత్ శకుంతల, వాంకుడో త్ జగన్, ముత్యాల సత్యనారాయణ, పెద్దబోయిన ఉమాశంకర్, ఇస్లావత్ బన్సీలాల్, రావూరి శ్రీనివాసరా వు, దుగ్గినేని శ్రీనివాసరావు, బానోత్ బన్సీలాల్, అజ్మీ రా అరుణ, ఈసం అరుణ, మూడు జ్యోతి, ధరావత్ పాండ్యానాయక్, వెంకట్రెడ్డి, కే.ఉమామహేశ్వర్రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, రాజారావు, వాహిని, ప్రమీల, దివ్య, నరేశ్, షాహిన్, ప్రకాశం పాల్గొన్నారు.
మహోన్నతుడు సీఎం కేసీఆర్: ఎంపీ నామా
మనిషి రూపంలో ఉన్న మహోన్నతుడు సీఎం కేసీఆర్ అని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. మండలంలోని రొట్టమాకురేవులో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2014 కంటే ముందు తెలంగాణ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎంతలా అభివృద్ధి చెందిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల కంటే ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైరా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యత్వం కలిగిన వీరన్న ఇటీవల విద్యుత్ షాక్తో మృతిచెందగా ఆయనకు మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును అతడి భార్య కవితకు అందజేశారు. అనంతరం రేలకాయలపల్లికి చెందిన 20 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరగా వారందరికీ ఎంపీ నామా గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.