మణికొండ, నవంబర్ 29 : సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్కు చెందిన తాండ్ర ఎల్లయ్య కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీపీ మల్లేశ్, మాజీ సర్పంచ్ నర్సింహ, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణలతో కలిసి రూ.లక్షా 20వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు అందించి ఆదుకుంటున్నామని తెలిపారు.