మైలార్దేవ్పల్లి,డిసెంబర్7: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో తాగునీరు, బోరు వాటర్, వైద్యం కోసం అదనపు గదులు, దవాఖాన ప్రధాన ద్వారం వరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ, దవాఖాన ఆవరణలో షెడ్డు, ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యులు ఎమ్మెల్యేను కోరారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 226 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్,యూత్ అధ్యక్షుడు రఘుయాదవ్ ,బాస శ్రీనివాస్ ,రమేశ్ , జిల్లా ఎన్సీడీ వైద్యఅధికారి డాక్టర్ జయంత్ ,కమ్యూనిటీ వైద్యఅధికారి సీరాజ్ఉద్దీన్ ,హెచ్ఈవో చెన్న కేశవులు, డాక్టర్ స్వాతి, హెల్త్ సూపర్వైజర్ శివకుమార్, సురేఖ, స్టాఫ్ నర్సులు జాకీరా ,కళ్యాణి, ఫౌజియా, శ్వేత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
మణికొండ, డిసెంబర్ 7 : పేదలకు భరోసాను కల్పిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. కోకాపేటకు చెందిన ఖానాపూర్ యాదయ్య మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్, నాయకుడు హరిశంకర్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకోగా రూ.2లక్షల చెక్కు మంజూరైంది. మంగళవారం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేసినట్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.