మల్కాజిగిరి, డిసెంబర్ 13: మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి.. అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం వెంకటాపురం డివిజన్, హనుమాన్నగర్తో పాటు మరికొన్ని కాలనీల్లో రూ.45లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటికే రూ.1.20కోట్లతో కానాజీగూడ నుంచి వెంకటాపు రం, లోతుకుంట నుంచి వెస్ట్ వెంకటాపురం వరకు వైట్ టా పింగ్ రోడ్లు వేశామని అన్నారు. వరద ముంపురాకుండా బాక్స్ డ్రైనేజీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతాలోపాలు జరగకుండా నిర్మాణ పనులను అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు. కార్యక్ర మంలో కార్పొరేటర్ సబితాకిశోర్, అనిల్కిశోర్, రాజేశ్గౌడ్, కిట్టు, లక్ష్మణ్, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, శివ, మోసిన్, ఆచా ర్య, వేణుగోపాల్, జోషి, వినోద్కుమార్, శాంతారావు, సామ్యూల్, కృష్ణారావు, పద్మావతి, ఉదయ, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.