నేరేడ్మెట్/మల్కాజిగిరి, నవంబర్ 29 : ప్రత్యేక తెలం గాణ కోసం ప్రాణత్యాగం చేయడానికి సీఎం కేసీఆర్ నిరా హార దీక్ష చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కోసం దీక్షచేసి రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా సోమవారం వినాయక్నగర్ చౌరస్తాలో ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం తపించిపోయారని.. పేదల అభివృద్ధికోసం సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారని అన్నారు.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా పింఛన్ అందజేస్తున్నారని అన్నారు. పేద కుటుంబంలోని ఆడ బిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకంలో రూ.1.00.116ల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నా రు. మహిళా గ్రూపులకు వడ్డిలేని రుణాలు మంజూరు చే స్తున్నారని అన్నారు. మైనారిటీల అభివృద్ధికోసం రెసిడెన్షియ ల్ స్కూళ్లను ప్రారంభించారని అన్నారు. విద్యార్థులు విదేశా ల్లో చదువుల కోసం రూ.20 లక్షలు అందజేస్తున్నారని అ న్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్కుమార్, అనిల్కిషోర్ గౌడ్, అమీనొద్దీన్, చంద్రమౌలి, సత్తయ్య, నర్సిం గ్, సత్యనారాయణ, మహిళా నాయకులు కవిత, అరుంధతి, లావణ్య, నాగరాజు, ఫరీద్, చెన్నారెడ్డి పాల్గొన్నారు.