ముషీరాబాద్, డిసెంబర్ 21: నియోజకవర్గంలో వరదనీటి సమస్య పరిష్కారానికి రూ. 53 కోట్లతో నాలా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. మంగళవారం అడిక్మెట్ డివిజన్ గణేశ్ నాలాను పరిశీలించిన ఆయన బస్తీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ ఇళ్లకు నష్టం జరగకుండా నాలా విస్తరణ, ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఆదర్శకాలనీ నుంచి చేపడుతున్న డ్రైనేజీ పైపులైన్ను తమ బస్తీ వద్ద నాలాలో కలుపకుండా ప్రత్యాణ్మాయ మార్గం చూడాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన ఎమ్మెల్యే వర దనీటి సమస్య తలెత్తకుండా ప్రహరీ నిర్మాణ పనులు చేపడుతామని, స్థానికులు సహకరించాలని సూచించారు. రాంనగర్-పద్మకాలనీ ప్రధాన నాలా వెంట వరద నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాగమయ్యకుంట, పద్మకాలనీ హెరిటేజ్ భవనం వద్ద నాలాపై స్లాబు ఏర్పాటు చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ. 12 కోట్లు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ముఠా జయసింహ, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, ఆకుల అరుణ్, శ్రీధర్రెడ్డి, సాంబశివరావు, రజినీ, సయ్యద్ అస్లాం, రవియాదవ్, గణేశ్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ గౌడ్, నేత శ్రీనివాస్, సోమయ్య, నర్సింగ్, విజయ్ పాల్గొన్నారు.
ముషీరాబాద్ చేపల మార్కెట్ను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరిశీలించారు. మార్కెట్లో కొనసాగుతున్న ఫుట్పాత్ నిర్మాణం, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తరలింపు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేపల వ్యాపారులు, గంగపుత్ర సంఘం నేతలతో సమావేశమైన ఎమ్మెల్యే సమస్యలపై చర్చించారు. గంగపుత్ర సంఘం ప్రతినిధులు సత్యనారాయణ, అమృత్రాజ్, శ్రీరాములు, గాండ్ల ప్రసాద్, నర్సింగ్రావు, శ్రీనివాస్, రుద్రప్రవీణ్ పాల్గొన్నారు.
కవాడిగూడ, డిసెంబర్ 21: సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని దేవీచౌక్ నుంచి కరీమియా మసీదు వరకు రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ గౌసొద్దీన్ తహ, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ తిరుపతిలతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ భోలక్పూర్లో దాదాపు రూ. 20 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మహ్మద్ షరీపొద్దీన్, నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, శ్రీ భవానీశంకర్ దేవాలయం మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బడుగు ప్రవీణ్కుమార్, మున్వర్ చాంద్, బాక్సర్ కృష్ణ, శ్రావణ్, గోవింద్ రాజ్, కేఎం సాయి తదితరులు పాల్గొన్నారు.