ఎర్రగడ్డ, డిసెంబర్ 9: గ్రేటర్ పరిధిలో జూబ్లీహిల్స్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటం తన ధ్యేయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఎర్రగడ్డలోని జామా మసీదు వీధిలో రూ.44.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ షాహీన్బేగంతో కలిసి గురువారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. నియోజకవ్గంలో వెనుకబడ్డ ఎర్రగడ్డ డివిజన్ అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో పెద్ద పీట వేశామని వివరించారు.
డివిజన్లోని అన్ని అంతర్గత మార్గాలను సీసీ రోడ్లుగా తీర్చిదిద్దే పనులు చివరి దశకు వచ్చాయన్నారు. ఇక ప్రతి బస్తీకి ఓ కమ్యూనిటీహాల్ ఉండే విధంగా చొరవ చూపి భవనాల నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు సం జీవ, నేతలు రాము, మ హ్మద్సర్దార్, మహ్మద్అహ్మద్, ముస్తాక్, బాలకృష్ణ, జహంగీర్, సయ్యద్స్రూల్, శ్రీనివాస్, మహిళాధ్యక్షురాలు క ల్యాణి, బాలసూర్య, జులేకా, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ డివిజన్కు చెందిన నలుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. అదే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నలుగురికి మంజూరైన చెక్కులను కూడా ఎమ్మెల్యే అందజేశారు. ఇందులో రవికుమార్, అమానుల్లాఖాన్లకు రూ.60 వేల చొప్పున, అతియాబేగంకు రూ.24 వేలు, శ్రియకు రూ.16 వేలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు సంజీవ, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.