జీడిమెట్ల, డిసెంబర్ 8 : సంక్షేమ సంఘాల నాయకుల ఐకమత్యంతోనే కాలనీల అభివృద్ధి సాధ్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం సుభాష్నగర్ డివిజన్, భాగ్యలక్ష్మీకాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నూతనంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా అసోసియేష న్ సభ్యులు పేట్బషీరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. బస్తీలో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తాన్నా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్వీ సాగర్రె డ్డి, యాదగిరియాదవ్, నాయకులు కుంటి మల్లేశ్, రామ్మోహ న్రావు, సత్యనారాయణ, శ్రీహరి, రాంరెడ్డి, శంకర్చారి, పద్మజ, ప్రసాద్, శ్రీధర్, నర్సింగరావు, ఆంజనేయులు, ప్ర భు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.