మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీకి చెందిన భాస్కర్రెడ్డికి సీఎం సహాయ నిధి పథకం కింద ఆస్పత్రి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 28,000 ఆర్థిక సాయం చెక్కును కార్పొరేటర్ రోజాదేవితో కలిసి విప్ గాంధీ సోమవారం తన నివాసంలో అందించారు.
ఈ సందర్భంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రజలకు అన్ని సందర్భాలలో అండగా నిలుస్తున్నదని గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, రఘునాథ్రెడ్డి, గురుచరణ్ దూబే, సువర్ణ పాల్గొన్నారు.