ఉప్పల్, జనవరి 20 : ముదిరాజ్ల సంక్షేమానికి తనవంతు తోడ్పాటు అందిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. రూ.34 లక్షలతో చేపట్టనున్న ఉప్పల్లోని ముదిరాజ్ భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ రజితాపరమేశ్వర్రెడ్డి హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామన్నారు. కాలనీలలో మౌలిక వసతుల కల్పనతోపాటు, సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఈఈ నాగేందర్, నేతలు పాల్గొన్నారు.