మియాపూర్, నవంబర్ 29 : భవిష్యత్లో ముంపు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల ఇంజినీరింగ్ అధికారులు, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి నాలా విస్తరణ పనులు, నీటి కాలువల నిర్మాణంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతేడాది కురిసిన భారీ వర్షాలతో గుర్తించి వరదనీటి ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జంట సర్కిళ్లలోని నెక్టార్ గార్డెన్, గఫూర్నగర్, ప్రేమ్నగర్, సిద్దిక్నగర్, ఇందిరానగర్, గచ్చిబౌలి, సుదర్శన్నగర్, రాజేందర్రెడ్డినగర్, చందానగర్, గురానాథ్ చెరువు పరిసర ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తాయని.. ఈ ప్రాంతాల్లో వరదనీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను గుర్తించాలన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ పనులకు నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు తెలిపారు. భవిష్యత్లో తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని పనులను చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈఏ శంకర్ నాయక్, ఈఈలు శ్రీనివాస్, శ్రీకాంతి, ఏఈ ధీరజ్ పాల్గొన్నారు.