న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ మిథాలీరాజ్ రిటైర్మెంట్పై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు దాదాపు ఫుల్స్టాప్ పడింది. ఇటీవల న్యూజిలాండ్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో సెమీస్ చేరకుండానే భారత్ నిష్క్రమించిన నేపథ్యంలో కెప్టెన్ మిథాలీతో పాటు వెటరన్ పేసర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్పై వార్తలు వెలువడ్డాయి. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఈ నెల 18 నుంచి మొదలవుతున్న జాతీయ సీనియర్ టీ20 టోర్నీలో రైల్వేస్ తరఫున మిథాలీ బరిలోకి దిగుతున్నది. మూడేండ్ల క్రితమే టీమ్ఇండియా టీ20 కెరీర్కు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజ క్రికెటర్..దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్నది. కెరీర్లో ఆఖరి దశలో ఉన్న మిథాలీ..యువ క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు బరిలోకి దిగుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి తోడు సెప్టెంబర్ వరకు భారత్కు అంతర్జాతీయ సిరీస్ లేకపోవడం మరో కారణంగా కనిపిస్తున్నది.