న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశారు. ఆ కేసులో ఇద్దరు హాకర్లను అరెస్టు చేశారు. తిలక్ బ్రిడ్జ్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లో అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని హర్దీప్ నగర్ , రాహుల్గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో వాటర్ బాటిళ్లు అమ్ముతుంటారు. ఐపీసీ 376డీ కింద కేసును బుక్ చేశారు. ఆ ఇదర్నీ అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసు ఆఫీసర్ హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.
పోలీసు కథనం ప్రకారం.. గుజరాత్కు చెందిన ఓ అమ్మాయి తన ఫ్రెండ్ దీపక్తో కలిసి ఢిల్లీ స్టేషన్కి వచ్చింది. గుజరాత్ వెళ్లేందుకు రైలు ఎక్కాల్సి సమయంలో ఆ ఇద్దరి మధ్య గొడవ అయ్యింది. అప్పుడు దీపక్ ఆమెను స్టేషన్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఈ ఘటన జరిగింది. సెంట్రల్ ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్న సమయంలో అమ్మాయికి, దీపక్కు ఘర్షణ జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న హాకర్లు ఇద్దరూ ఆమెను కలిశారు. సోదరుడికి ఫోన్ కాల్ చేసేందుకు మొబైల్ ఇవ్వాలని ఆ అమ్మాయి హాకర్లను వేడుకున్నది. రైలు దొరికేలా హెల్ప్ చేయాలని ఆ అమ్మాయి వాళ్లను అడిగింది. అయితే మరో స్టేషన్ వద్ద ట్రైన్ దొరకుతుందని చెప్పిన హాకర్లు ఆ అమ్మాయిని తిలక్ బ్రిడ్జ్ వద్ద ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి రేప్ చేశారు.