హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొత్త సభ్యులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రొటెం చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులుతో కలిసి శాసన మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు.
కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్క సుమన్, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.