హైదరాబాద్ : పాఠశాలలకు సెలవంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. సోషల్ మీడియాతో జరుగుతున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మొద్దన్నారు. మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనాను కట్టడి చేద్దాం అంటూ మంత్రి పిలుపునిచ్చారు. అదే సమయంలో విద్యా సంస్థల యాజమాన్యాలు సైతం అన్ని విధాలా కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.