ఖమ్మం/ మామిళ్లగూడెం/ రఘునాథపాలెం, ఫిబ్రవరి 8: జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని 18వ డివిజన్ శ్రీరామ్నగర్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని బుధవారం ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్ మందడపు లక్ష్మీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు కల్యాణ మండపంలో..
పోలీసులందరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. ఖమ్మం నగరంలోని పోలీసు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పని చేసే అధికారులు, సిబ్బంది అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఈ శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే గమనించి తగిన చికిత్స పొందాలన్నారు. అవసరమైన వాళ్లు ఉచిత కళ్లజోళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, ఈ శిబిరంలో సుమారు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బీ.మాలతి, ఏఆర్ ఏడీసీపీ కుమారస్వామి, ఎస్బీ ఏసీపీ ప్రసన్నకుమార్, ఆర్ఐలు శ్రీనివాస్, సాంబశివరావు, సీఐలు సత్యనారాయణరెడ్డి, చిట్టిబాబు, యూనిట్ హాస్పిటల్ డాక్టర్ జితేందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.