న్యూఢిల్లీ: రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే యోచన కేంద్రానికి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రైతుల ఉద్యమానికి జడిసి కేంద్రం సాగు చట్టాలను రద్దు చేయడం తెలిసిందే. పీఎం కిసాన్ పథకం కింద 11.78 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.1.82 లక్షల కోట్లు పంపిణీ చేశామని తోమర్ అన్నారు.