మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడవ సారి గెలుపొంది హ్యట్రిక్ కొట్టడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy )జోస్యం చెప్పారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం శామీర్పేట్లో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ ( BRS ) లో చేరారు.
ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ (CM KCR) వైపే రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్లు గల్లంతు చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ( BJP ) తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడంలేదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన సీఎం కేసీఆర్కు రైతులందరూ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో అనేక ఉద్యోగాలను కల్పిస్తున్న దృష్ట్యా యువతి, యువకులు ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని కోరారు . ఎన్నో మాయ మాటాలతో ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను నిలదీయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, తూకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, ఎంపీపీలు ఎల్లుబాయి, హారిక, జడ్పీటీసీ అనిత, బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, ఎంఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు మద్దుల శ్రీనివాస్రెడ్డి, దయానంద్యాదవ్, వీరారెడ్డి, చంద్రశేఖర్యాదవ్, సుదర్శన్, మల్లేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
బీజేపీ పార్టీ నుంచి మేడ్చల్ నియోజవర్గంలోని వివిధ మండలాలకు చెందిన చంద్రకాంత్రెడ్డి, నందు, సాయికిరణ్, అక్షయ్, అదికేశవ్రెడ్డి, బాల్రెడ్డి, గోపాల్రెడ్డి, ప్రజ్వల్తో పాటు 150 మంది కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్రెడ్డి, నరేశ్, అజయ్, అల్తాఫ్, బి. ఉదయ్రెడ్డి, జక్కా ఈశ్వర్, రమేశ్, వాణిప్రసాద్, మధు, ప్రవీణ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.