కీసర, డిసెంబర్ 28: కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదని భరోసానిచ్చారు. కీసర మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం మంత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… యాసంగిలో వరిపంటకు బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
కూరగాయల పంటలు సాగు చేసే రైతుల కోసం నారును కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఎకరానికి సరిపడ నారును కేవలం నాలుగు వందలకే అందిస్తున్నామని, ఇందుకు ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని, మేడ్చల్ జిల్లా పంటలకు అనువైన భూమిగా వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారని మంత్రి తెలిపారు.
కీసర మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా చీర్యాల్ గ్రామంలో మంత్రికి స్వయంగా పంచాయతీ సభ్యులు, గొల్ల కురుమలు కలిసి గొర్రెపిల్లను బహూకరించి, గొంగడితో మంత్రిని సన్మానించారు. అనంతరం మంత్రి కీసర ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నారని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, సర్పంచులు ధర్మేందర్, పెంట య్య, మహేందర్రెడ్డి, రాజుముదిరాజ్, ఆండా లు మల్లేశ్, కవిత జైహింద్రెడ్డి, మాధురి వెంకటేశ్, సత్తమ్మ, గోపాల్రెడ్డి, విమల నాగరాజు, ఎంపీటీసీలు నారాయణశర్మ, వెంకటేశ్, ప్రమీలరెడ్డి, కిరణ్జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ సభ్యులు, ఉప సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాతే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, యాద్గార్పల్లి, కీసర, అంకిరెడ్డిపల్లి, భోగారం, బర్సీగూడ, రాంపల్లిదాయర, గోధుమకుంట, చీర్యాల్ తదితర గ్రామాల్లో రూ.1.75 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అభివృద్ధి పనులకు జడ్పీచైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 12,700 గ్రామాల్లో హరితహారం, డంపింగ్యార్డు, వైకుంఠధామాలు, పల్లె ప్రగతితో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. రైతులకు రైతుబంధు ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. 66లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు రైతు బంధు పథకం డబ్బులు విడుదల చేశామని తెలిపారు.