ముంబై: ముంబైతో జరిగిన మ్యాచ్లో ధోనీ తన ఫినిషింగ్ టచ్తో ఐపీఎల్కు కొత్త కిక్ తెచ్చాడు. చివరి 4 బంతుల్లో 16 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. చివరి ఓవర్లో మూడో బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్, అయిదో బంతికి రెండు రన్స్, ఆరో బంతికి ఫోర్ కొట్టి చెన్నైకి మెమరబుల్ విక్టరీని అందించాడు. వయసు పెరిగినా.. తన పవర్ గేమ్లో ట్యాలెంట్ తగ్గలేదని ధోనీ మరోసారి నిరూపించాడు. వాస్తవానికి ఈ రెండు జట్లు ఈ ఏడాది టోర్నీలో ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో చివరి వరుసలో ఉన్నాయి. ఏడు మ్యాచ్లు ఆడిన ముంబై ఒక్కటీ గెలవలేదు. ఇక చెన్నై జట్టు.. ధోనీ సూపర్ షోతో రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఎంఎస్ ధోనీ ఛాంపియన్ ఇన్నింగ్స్పై ఇవాళ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో స్పందించారు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ధోనీ ఓ ఛాంపియన్ క్రికెటర్ అని, అతనో అసాధారణ ఫినిషర్ అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు. రోజు రోజుకీ ఈ లెజెండరీ క్రికెటర్ మరింత పరిణతి చెందుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
Age indeed is just a number!!!
What an outstanding finisher this champion is @msdhoni #MSDhoni the legend grows 👏👏
— KTR (@KTRTRS) April 21, 2022
కూల్గా కొట్టేశాడు..
ధోనీ మరోసారి ఫినిషింగ్ టచ్తో కేక పుట్టించాడు. ఐపీఎల్లో గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్ ఫైనల్ ఓవర్లో థ్రిల్లింగ్ ఇన్నింగ్స్తో ధోనీ ఆకట్టుకున్నాడు. ధోనీ ఫటాఫటా షాట్లకు ముంబై జట్టుకు వరుసగా ఏడో ఓటమి తప్పలేదు. చెన్నై విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో.. ఉనాద్కట్ వేసిన తొలి బంతికి ప్రిటోరియస్ ఔట్ కాగా.. రెండో బంతికి బ్రేవో సింగిల్ తీసి ధోనీకి స్ట్రయికింగ్ ఇచ్చాడు. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 16 పరుగులకు చేరగా.. ఆ దశలో ధోనీ తన స్టయిల్లో చెలరేగిపోయాడు. మూడో బంతికి బౌలర్ తల మీదుగా భారీ సిక్సర్ అరుసుకున్న ధోనీ.. నాలుగో బాల్కు ఫైన్ లెగ్ దిశగా బౌండ్రీ రాబట్టాడు. ఐదో బంతికి రెండు పరుగులు రాగా.. ఆఖరి బాల్కు ఫోర్ కొట్టిన ధోనీ తనదైన శైలిలో మ్యాచ్కు ఫినిషింగ్ ఇచ్చేశాడు. తొలుత ముంబై ఏడు వికెట్లకు 155 రన్స్ చేయగా.. 20 ఓవర్లలో చెన్నై ఆ టార్గెట్ను అందుకున్నది.