హైదరాబాద్: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలియజేశారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అన్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాజ్వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
My wholehearted condolences to Sri @yadavakhilesh Ji and the entire family of Sri Mulayam Ji
Rest in peace Neta Ji 🙏
This is truly end of an era in Indian politics & my prayers for strength to all Samajwadi Party leaders/loyalists https://t.co/1Z776lJWbp
— KTR (@KTRTRS) October 10, 2022