హైదరాబాద్ : అకాల వర్షాలు, వాతావరణంలో వస్తున్న మార్పులతో పలు జిల్లాలో విషజ్వరాలు ప్రభలకుండా వైద్య శిబిరాలు (Medical Camps) ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జగిత్యాల (Jagtial ) , పెద్దపల్లి (Peddapalli) జిల్లాల్లో ని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులతో గ్రామాల్లో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వైద్యుల సలహాలు పాటించాలని సూచించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సకాలంలో స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని అన్నారు.