నిర్మల్ : జిల్లా కేంద్రంలోని గండి రామన్న శివారులో గల నంది గుండం దుర్గామాత దేవాలయం నాలుగో వార్షికోత్సవానికి ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. మంత్రి దంపతులకు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం దుర్గామాత ఆలయం అద్భుతంగా నిర్మించుకున్నామని తెలిపారు. ఈ ఆలయానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు.
మొన్ననే గాలి గోపురం నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించామని అన్నారు. కాళికా మాత ఆలయాన్ని రూ.50 లక్షల తో నిర్మిస్తున్నామని వివరించారు.
నంది గుండం ప్రదేశంలోని 12 ఎకరాల అటవీ శాఖ భూమిని దేవాలయానికి ఇవ్వనున్నామని, త్వరలోనే ప్రక్రియ మొదలవుతుందని మంత్రి తెలిపారు. పక్కనే గల గండి రామన్న దత్త సాయి ఆలయం అభినవ షిరిడీగా తయారయ్యిందని, ఇప్పటి వరకు కోటి 50 లక్షలతో ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు.
అనంతరం రాజ గోపురం నిర్మాణ పనులను మంత్రి పరిశిలించారు. మంత్రి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, లక్కడి జగన్మోహన్ రెడ్డి, ఆలయ పూజారి కొండజి చారి, నాయకులు పూదరి నరహరి, ఆలయ ఈఈ రామారావు,
తదితరులు ఉన్నారు.