కరీంనగర్ : జిల్లాలోని చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబ లోని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా వారి కుటుంబ సభ్యులను మంత్రి గంగులకమలాకర్ పరామర్శించారు.
ఎవరు కూడా అధైర్యపడొద్దని అండగా ఉంటామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ కృష్ణారావు, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, నాయకులు ఉన్నారు.