నార్కట్పల్లి, ఏప్రిల్ 28 : పితృవియోగం పొందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని ఎమ్మెల్యే చిరుమర్తి నివాసంలో పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి నర్సింహా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిరుమర్తిని ఓదార్చి, ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.కాగా, ఎమ్మెల్యే తండ్రి నర్సింహా ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.