హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిని, పూలను ఆరాధించే అరుదైన పండుగ మన ఆడబిడ్డలదని అన్నారు. బతుకమ్మ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీక అని.. మహిళలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.