న్యూఢిల్లీ : భారత్లో జడ్ఎస్ ఈవీ ఫేస్లిఫ్ట్ లాంఛ్కు ముందు వాహనం లుక్ను ఎంజీ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే విక్రయాలు సాగిస్తున్న ఎంజీ జడ్ఎస్ ఈవీ ఫేస్లిఫ్ట్ త్వరలోనే భారత్ షౌరూంల్లో సందడి చేయనుంది. ఎంజీ జడ్ఎస్ ఈవీ ఫేస్లిఫ్ట్లో పలు కాస్మెటిక్ మార్పులతో పాటు నూతన ఫీచర్లను జోడించారు.
ఇక న్యూ వెహికల్ ముందు భాగంలో షార్పర్ ఎల్ఈడీ డీఆర్ఎల్లు, ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి. రియర్ సైడ్ న్యూ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, న్యూ బంపర్తో జడ్ఎస్ ఈవీ పాత వెర్షన్ లుక్ను తలపించినా కొన్ని న్యూ ఫీచర్స్ను కస్టమర్లను ఆకట్టుకునేలా జోడించారు. షార్పర్ లైన్స్, మెరుగైన రోడ్ ప్రెజెన్స్తో ఎంజీ జడ్ఎస్ ఈవీ ఫేస్లిఫ్ట్ ఎస్యూవీ అప్పీల్లో మెరుగ్గా కనిపిస్తోంది.
ఎక్స్టీరియర్ లుక్తోనే ఎంజీ న్యూ వెహికల్ ఇమేజ్ వెల్లడించినా ఇంటీరియర్స్లోనూ పలు మార్పులను చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక జడ్ఎస్ ఈవీ ఎగ్జైట్ రూ 21.49 లక్షలు పలకనుండగా ఎక్ల్సూజివ్ రూ 25.18 లక్షలకు అందుబాటులో ఉండనుంది. జడ్ఎస్ ఈవీ ఫేస్లిఫ్ట్ మార్కెట్లో అందుబాటులోకి వస్తే హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్కు దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.