అరేబియా సముద్రంలో రెండు వ్యాపార నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటన శుక్రవారం గుజరాత్ తీరాన గల్ఫ్ ఆఫ్ కచ్లో చోటుచేసుకుంది. ప్రమాదధాటికి నౌకల్లోని చమురు సముద్రంలో కొంతమేర కలిసిపోయింది. అయితే సముద్ర జీవ వైవిధ్య ప్రాంతం సమీపంలోనే ఈ ప్రమాదం జరుగడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.