ముంబై: సుమారు 1400 కోట్ల విలువైన మెఫిడ్రోన్ డ్రగ్స్ను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెఫిడ్రోన్ సుమారు 700 కిలోల ఉంటుందని పోలీసులు తెలిపారు. పాల్గర్ జిల్లాలోని నలసోపోరా ఉన్న ఓ డ్రగ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో మెఫిడ్రోన్ను సీజ్ చేశారు. ఈ కేసులో అయిదుగుర్ని అరెస్టు చేశారు. ముంబై క్రైం బ్రాంచీకి చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ ఈ ఆపరేషన్ చేపట్టింది. డ్రగ్ పెడ్లర్స్కు మెఫిడ్రోన్ను సరఫరా చేస్తారని పోలీసులు తెలిపారు.
రసాయన శాస్త్రంలో పీజీ చేస్తున్న ఓ విద్యార్థి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వివిధ రకాల పరిశోధనల ద్వారా మెఫిడ్రోన్ తయారీ ఫార్ములాను ఆ విద్యార్థి కనుగొన్నట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. మెఫిడ్రోన్ను మియావ్ మియావ్ అంటారు. దీన్ని ఎండీ అని కూడా పిలుస్తారు. ఇదో సింథటిక్ స్టిముల్యాంట్.