కొండాపూర్: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మెన్గా నియమితులైన సామాజిక వేత్త, బీసీ ఉద్యమాల నాయకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్రావును శిష్టకరణ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం సత్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ డీవీ కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణ మోహన్ మాట్లాడుతూ బీసీ కులాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
బీసీలకు ఉన్నత పదవులను అందించడంతో పాటు అన్ని రంగాలలో అవకాశాలను కల్పిస్తూ వారి ఉన్నతికి తోడ్పడు తుండడం సంతోషంగా ఉందన్నారు. బీసీ కమిషన్ ఛైర్మెన్గా నియమించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీల అభ్యున్నతికి అన్ని వేళాల అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్కుమార్, అడిషనల్ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణ రావు, కోశాధికారి ఉరిటి పార్వతీశ్వర రావు, సలహాదారులు పార్ధసారధి, శంకర్ పట్నాయక్, ప్రతాప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.