సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాడ్సే’ చిత్ర టీజర్ను సోమవారం అగ్ర నటుడు చిరంజీవి విడుదల చేశారు. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజకీయ వ్యవస్థపై ఓ యువకుడి తిరుగుబాటును ఆవిష్కరిస్తూ టీజర్ను తీర్చిదిద్దారు. గాడ్సేను పట్టుకోవడానికి మిలటరీ బలగాలు ప్రయత్నించే నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ‘వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయ్..వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయ్… కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్..బికాజ్ యువార్ లూటింగ్ పబ్లిక్ మనీ ఇన్ ది నేమ్ ఆఫ్ సర్వీస్’ అంటూ టీజర్లో చెప్పిన సంభాషణలు శక్తివంతంగా ఉన్నాయి. ఐశ్వర్యలక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, నాగబాబు, సిజ్జుమీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ ఎస్, సంగీతం: సునీల్కశ్యప్, నిర్మాణ సంస్థ: సీకే స్క్రీన్స్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి.