మెదక్, నవంబర్ 10: యాసంగి వడ్లను కొనుగోలు చేయకపోతే కేంద్రం మెడలు వంచైనా రైతులను కాపాడుకుంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని క్రిస్టల్ గార్డెన్స్లో మెదక్ మార్కెట్ కమిటీ నూతన వ్యవసాయ పాలకవర్గం అభినందన సభను ఏర్పాటు చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు వైద్య, ఆరోగ్యశాఖను అదనంగా అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కంటే మెదక్ జిల్లాలోనే వరి ఎక్కువగా పండుతున్నదని తెలిపారు. కాగా, యాసంగిలో పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, రైతు పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి వాటి కింద ఉన్న భూముల సస్యశ్యామలం అయ్యేలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు.
రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..
రైతుల సంక్షేమమే సీఎం ధ్యేయం…
నమ్మకాన్ని వమ్ము చేయను..