సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ )/అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, అధికారులు కలిసి పర్యటించారు. పలు సమస్యలపై అరా తీశారు. శివంరోడ్డు నుంచి డీడీ కాలనీ రోడ్డు వెడల్పు ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించిన ప్రహరీని తొలగించాల్సి ఉన్నందున సంబంధిత స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని అంబర్పేట్ తాసీల్దార్ను మేయర్ ఆదేశించారు. డీడీ కాలనీ సాయిబాబా గుడికి భక్తులు చాలా మంది వస్తున్నారని, దీంతో ట్రాఫిక్ సమస్య వస్తుందని, అదేవిధంగా ఛే నంబర్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఇబ్బందులు వస్తున్నాయని కార్పొరేటర్ పద్మ వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
రామంతాపూర్, ఉప్పల్, ఇతర ప్రాంతాలకు అక్కడి నుంచే వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలుగా డీడీ కాలనీ, పరిసర కాలనీల నుంచి వెళ్తున్నారని, దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని కార్పొరేటర్ ఈ సందర్భంగా మేయర్కు వివరించారు. శివం రోడ్డు నుంచి సాయిబాబా టెంపుల్ మీదుగా పారు వరకు ఉన్న 40 ఫీట్ల రోడ్డును 60 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయాలని కార్పొరేటర్ మేయర్ను కోరారు. రోడ్డు వెడల్పుకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలన చేసి నివేదిక అందజేయాలని చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి దేవేందర్రెడ్డిని మేయర్ కోరారు.
బతుకమ్మకుంట వద్ద రోజు వారీగా చెత్త తొలగింపులో జాప్యం చేయవద్దని మేయర్ అధికారులను ఆదేశించారు. డివిజన్ స్థాయిలో సంబంధిత కార్పొరేట్తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించి, సమస్యల పరిషారానికి చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ పర్యటనలో అంబర్పేట డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, సికింద్రాబాద్ జోన్ సిటీ ప్లానర్ రంజిత్, సరిల్ సహాయ మెడికల్ అధికారి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.